వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం వాటా అమ్మకోవచ్చు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సత్యం సంస్థలో 51 శాతం వాటాను అమ్మేందుకు సెబి అనుమతి ఇచ్చింది. కార్పోరేట్ చరిత్రలో అతి పెద్ద కుంభకోణం నమేదు చేసిన సత్యం సంస్ధను నిలబెట్టాలంటే..ఇప్పుడున్న పరిస్దితుల్లో వాటా అమ్మకమే పరిష్కారమని నిపుణులు తేల్చటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మకం అంతర్జాతీయ బిడ్డింగ్‌ ద్వారా జరగటానికి తమకు అనుమతి లభించినట్లు సత్యం వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అలాగే ఈ వేలం రెండు దశలుగా జరుగుతుందని వారు వివరించారు. మొదటి దశలో 31 శాతం షేర్లను, అనంతరం 20 శాతం షేర్లను విక్రయిస్తామని తెలిపారు. అంతా సవ్యంగా జరిగితే సత్యం సమస్యలు కొంత వరకూ ఓ కొలిక్కి వచ్చినట్లేనని వారు అభిప్రాయపడుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X