పది లక్షల ఉద్యోగాలంటూ చిరు వాగ్ధానం
ఇక చిరంజీవి ఇంద్రవెల్లి మృవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ..భూమి కోసం..భుక్తి కోసం పోరాడి అసువులు బాసిన అమరవీరులకు లాల్ సలాం.. వీరులారా మీకు ఎర్రెర్ర దండాలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. అలాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణా ళికను రూపొందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గిరిజన గ్రామాలన్నింటిలో రక్షిత నీటి సౌక ర్యం కల్పించడమే కాకుండా ఊరూరా రోడ్డు వసతి కల్పిం చి గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పులు తీసుకువచ్చే పథకాలను చేపడుతామని అన్నారు. 500 జనాభా కలిగి ఉన్న గిరిజన గ్రామాలన్నింటిని గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి గ్రామాల్లో సూక్ష్మ ప్రణాళికల ద్వారా అభివద్ధిని సాధిస్తామని వాగ్ధానం చేసారు.
Comments
Story first published: Saturday, March 7, 2009, 10:49 [IST]