రాజమండ్రి:
ఈ
ఎన్నికల్లో
ప్రజారాజ్యం
పార్టీ
ఉమ్మడి
గుర్తుతోనే
పోటీ
చేస్తుందని,
ఆ
మేరకు
ఈ
నెల
16వ
తేదీన
కోర్టు
తీర్పు
వెలువడే
అవకాశం
ఉందని
ప్రజారాజ్యం
పార్టీ
అగ్రనేతలు
నాగేంద్రబాబు,
తమ్మినేని
సీతారాం
ఆశాభావం
వ్యక్తంచేశారు.
ఈ
నెల
10వ
తేదీన
రాజమండ్రిలో
నిర్వహించ
తలపెట్టిన
సామాజిక
న్యాయ
శంఖారావం
సభ
ఏర్పాట్లను
పర్యవేక్షించేందుకు
ఆదివారం
వారిక్కడకు
వచ్చారు.
ఈ
సందర్భంగా
పార్టీ
జిల్లా
కన్వీనర్
చక్రవర్తితో
కలిసి
వారు
విలేకరులతో
మాట్లాడారు.
ఉమ్మడి
గుర్తు
వస్తుందని...ఒకవేళ
రాకుంటే
చిరంజీవి
సింబలే
తమకు
ఉపయోగపడుతుందని
అన్నారు.
ప్రజల్లో
ఎటువంటి
గందరగోళం
లేదన్నారు.
ఈ
నెల
15వ
తర్వాత
మొదటి
జాబితా
విడుదల
చేస్తామన్నారు.
పార్టీ
కోసం
పనిచేసే
వారికి,
ప్రజల్లోకి
విస్త్రృతంగా
వెళ్లేవారికి
సీట్లు
కేటాయిస్తామన్నారు.
ఇప్పుడే
తమకు
టిక్కెట్టు
వచ్చిందని
ప్రచారం
చేసుకుంటున్నవారిని
నమ్మకూడదన్నారు.