తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారంలోపే మా జాబితా: చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
రాజమండ్రి: రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీనుంచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి ప్రకటించారు. రాజమండ్రిలో ఈరోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాధ్యమైనంతవరకు ఫ్రెష్‌లుక్‌తో ఈ జాబితా ఉంటుందని అన్నారు. తాను తిరుపతి నుంచే పోటీ చేస్తానని, రెండవ స్థానంనుంచి చేస్తే అది నరసాపురం అవుతుందని అన్నారు. మహిళలకు సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కేటాయిస్తామని, టికెట్లు దక్కని మహిళలకు నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆయన అన్నారు.

రాజమండ్రి తరహా శంఖారావాలను సమయాన్నిబట్టి కనీసం మూడుచోట్ల ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. ఎస్సీల వర్గీకరణపై తమకు ఖచ్చితమైన అభిప్రాయం ఉందని శాస్త్రీయపద్ధతిలో మాదిగలతోపాటు అణగారిన వర్గాలన్నిటికి న్యాయం జరగాలన్నదే తమ అభిప్రాయమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X