'సాక్షి' చానల్ కు ఇసి మొట్టికాయ
ఆ కమిటీ పరిశీలించి అనుమతి ఇచ్చిన తర్వాతనే సదరు ప్రకటనలను ప్రసారం చేసుకోవాలి. అయితే..టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ను ప్రతిపక్ష నేత చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్టు యానిమేషన్తో రూపొందించిన ప్రకటనను కమిటీ అనుమతి లేకుండానే..సాక్షి ఛానల్ ప్రసారం చేసింది. దీనిని ఈసీ సీరియస్గా తీసుకుంది. ఈ మేరకు నోటీసులు జారీ చేయాలని మంగళవారం నిర్ణయించింది.
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన రోజు నుంచీ వివిధ రాజకీయ పార్టీలు రూపొందించుకున్న ప్రకటనల్లో 31 ప్రకటనలకు ఈసీ అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీలు ఇప్పటివరకు మొత్తం 33 ప్రకటనలను రూపొందించాయి. వాటిలో 31 ప్రకటనలకు అనుమతి లభించింది.
Comments
Story first published: Wednesday, March 11, 2009, 9:31 [IST]