శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ అనుకరణ సాధ్యం కాదు: జూనియర్

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
శ్రీకాకుళం: స్వర్గీయ నందమూరి తారకరామారావు నిజమైన వారసులు ప్రజలేనని యువనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో టీడీపీ పార్టీకి ఎన్టీఆర్‌ ప్రచారంను మూడున్నర గంటలు ఆలస్యంగా భారీ జనసందోహం మధ్య ప్రారంభించారు. ఇచ్చాపురం రోడ్‌ షోలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ భౌతికంగా మన మధ్య లేకున్నా ఆత్మ ఇక్కడే తిరుగుతుందని, ఆయనకు తాము కుటుంబసభ్యులము మాత్రమే అని నిజమైన వారసులు ప్రజలే అని చెప్పారు.

టీడీపీని అధికారంలోకి తెచ్చెందుకు ఓ కార్మికుడిగా పనిచేసేందుకే మీ ముందుకు వచ్చాను, తాత గారిని అనుకరించడానికి ఖాకీ డ్రస్‌ వేసుకోలేదు, ఆయన్ను అనుకరించడం ఎవరికీ సాధ్యం కాదని ఎన్టీఆర్‌ వెల్లడించారు. రూ.50 రైతాంగానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చింది టీడీపీయే అని, జన్మభూమి, ఐటీ ఘనత చంద్రబాబుదని, ఆయన ఎన్టీఆర్‌ ఆశయ సాధనకోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ఓ వైపు ఎన్టీఆర్‌ ఆశయాలను చెబుతూ అధికార కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. రైతురాజ్యంగా చెప్పుకునే ఈ ప్రభుత్వం 6వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ ఓటుతో అవినీతిపరుల గుండెల్లో పోటు పొడవండి అని ఎన్టీఆర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X