హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్‌ బ్లాక్‌ మనీని వైట్‌..నారాయణ

By Staff
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అలాగే రాష్ట్ర రాజకీయాలను వైఎస్ తన కుంటుంబ వ్యాపార సంస్థగా మార్చుకున్నాడని ఆయన అన్నారు. కొండాపూర్‌ చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో రెండు రోజుల పాటు జరిగే ఆ పార్టీ రాష్ట్రస్థాయి ప్రజానాట్యమండలి శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్‌ అవినీతి బాగోతాలకు అంతులేకుండా పోయిందంటూ ప్రసంగించారు. అలాగే జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులను ప్రారంభించింది వైయస్ జేబులు నింపుకోవటానికేనన్నారు. వందలాది ఎకరాల భూమని ఆక్రమించిన ఆకుల రాజయ్య గురించి అందరికీ తెలిసిందేనని, ఢిల్లీలో ఉన్న ఆయనకు ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చి నిలబెట్టేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల్లో ప్రజలను చైతన్య పరిచే దిశగా ప్రజానాట్యమండలి కళా రూపాలు ప్రదర్శనలు ఉండాలన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X