రేపటి నుంచి ఎన్టీఆర్ విశాఖ టూర్
10.15కి తగరపువలస, 11.15కి మధురువాడ (బోయపాలెం జంక్షన్ మీదుగా), మధ్యాహ్నం 12 గంటలకు ఎంవీపీ కాలనీ కూడలికి జూనియర్ ఎన్ టిఆర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45కి ఆశీల్మెట్ట, 1.15కి జగదాంబ జంక్షన్లలో రోడ్ షోలో భాగంగా మాట్లాడతారు. భోజన విరామానంతరం సాయంత్రం నాలుగు గంటలకు కాన్వెంట్ జంక్షన్ మీదుగా ఐదు గంటలకు కంచరపాలెంలో, ఆరు గంటలకు గాజువాకలో, రాత్రి ఏడు గంటలకు పెదగంట్యాడ, ఎనిమిది గంటలకు కూర్మన్నపాలెం, 8.45కి అగనంపూడిలో ప్రసంగిస్తారు. రాత్రికి బస నగరంలోనే చేస్తారు. 19వ తేదీ ఉదయం 9.30కి బయలుదేరి పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపాలేనికి 10.30కి చేరుకుని ప్రచారానికి శ్రీకారం చుడతారు.
11.15కి సబ్బవరం, 12.15కి వెంకన్నపాలెం జంక్షన్లలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.15కి చోడవరం చేరుకుంటారు. భోజనం చేసిన తరువాత సాయంత్రం నాలుగు గంటలకు వడ్డాది జంక్షన్, ఐదు గంటలకు రావికమతం, ఆరు గంటలకు కొత్తకోట, 6.45కి రోలుగుంట, రాత్రి 7.30కి నర్సీపట్నం సభల్లో మాట్లాడతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. 20వ తేదీ నర్సీపట్నం నుంచి పర్యటనను ప్రారంభిస్తారు. 10 గంటలకు మాకవరపాలెం, 11.30కి తాళ్లపాలెం, 12.30కి కశింకోట, 1.15కి అనకాపల్లి చేరుకుంటారు.
భోజనం అనంతరం నాలుగు గంటలకు మునగపాక, సాయంత్రం 5.15కి అచ్యుతాపురం, ఆరు గంటలకు రాంబిల్లి, ఏడు గంటలకు ఎలమంచిలి, రాత్రి ఎనిమిది గంటలకు నక్కపల్లి, తొమ్మిది గంటలకు పాయకరావుపేటల్లో ప్రసంగిస్తారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ జిల్లా పర్యటన ముగుస్తుందని, జిల్లాలో మొత్తం 120 కిలోమీటర్లు పర్యటిస్తారని టిడిపి జిల్లా అధ్యక్షుడు బండారు తెలిపారు.