వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీ పార్వతి ఓ శిఖండి: నన్నపనేని

By Staff
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
గుంటూరు: ఎన్టీఆర్‌ ఎలా పదవీచ్యుతుడైంది, ఎవరి వద్ద చనిపోయిందీ అందరికీ తెలుసని తెలుగు దేశం అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆరోపించారు. లక్ష్మీపార్వతిని కాంగ్రెస్‌ పార్టీ శిఖండిలా వాడుకుంటోందని ఆమె అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీపార్వతిపై విమర్శలు చేసారు. చంద్రబాబు వాడుకొని వదిలివేస్తాడని జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలకృష్ణలకు లక్ష్మీపార్వతి సూచించడంపై రాజకుమారి మండిపడ్డారు. ఆమె కాంగ్రెస్‌ పార్టీకి పావులా మారారని ఆరోపించారు. శ్రీకాకుళంలో నేరుగా కాంగ్రెస్‌ పార్టీ సభకు హాజరై బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లపై విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు.

రాహుల్‌, ప్రియాంక, జగన్‌లు పిల్ల రాబందులా..? జూనియర్‌ ఎన్టీఆర్‌ పిల్లకాకి అయితే రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ, వైఎస్‌ జగన్మోహనరెడ్డిలు పిల్ల రాబందులా? అని రాజకుమారి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా, ఏ పత్రిక తిరగేసినా, ఏ చానల్‌ చూసినా జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రభంజనమే కనిపిస్తున్నదన్నారు. చివరగా ఎన్టీఆర్‌ మృతికి లక్ష్మీపార్వతే కారణమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X