ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రకాశం: బాలయ్య వర్సెస్ బావ

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటనలో సినీ నటుడు బాలయ్య తన సోదరి, కేంద్ర మంత్రి పురందేశ్వరిపై విమర్శలు చేయడానికి కూడా వెనకాడలేదు. దీంతో బాలయ్యపై ఆయన బావ, పురందేశ్వరి భర్త, శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. మొత్తం మీద యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రకాశం జల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. జిల్లాలో ఆరు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో ఆయన 600 కిలోమీటర్లు పర్యటించారు. మార్టూరుతో ముగిసిన ఆయన పర్యటనకు ప్రతిచోట ముందుకంటే ఎక్కువగా ప్రజలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పాలనపై ఆయన నిశిత విమర్శలు చేస్తూ ఎన్టీఆర్‌ ఆశయాలను ప్రతిచోట గుర్తు చేశారు. తన తండ్రి ఎన్టీఆర్‌తోపాటు తెలుగు నేతలను ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అవమానించిన తీరును ఆయన వివరించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రతిచోట ప్రస్తావించారు. మొత్తంమీద ఆయన పర్యటన తెలుగుదేశం ఆశించిన ఫలితాన్ని రాబట్టినట్లేనని అనుకోవచ్చు.

మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోవడానికి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లను రంగంలోకి దించడమే మార్గమని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ విషయంలో విజయం సాధించినట్లేనని భావించవచ్చు. కాగా, బాలయ్య తన సోదరి, కేంద్ర మంత్రి పురందేశ్వరిపై కూడా విమర్శలు చేయడానికి వెనకాడ లేదు. బాలయ్య విమర్శలను ఆయన బావ, పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఖండించారు. బాలయ్య చేసిన విమర్శల్లో నిజం లేదని, కావాలంటే తాను బాలయ్యకు స్క్రిప్టు రాసిస్తానని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X