వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విమాన ప్రమాదంలో 17 మంది మృతి
ఆక్లాండ్: అమెరికాలోని ఆక్లాండ్ లో జరిగిన విమాన ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. ఈ విమానం కాలిఫోర్నియాలోని అరోవిల్లె నుంచి బ్యుట్టేకు బయలుదేరి ప్రమాదానికి గురైంది. విమానాశ్రయంలో దిగబోయే ముందు హఠాత్తుగా విమానం పక్కనే ఉన్న స్మశానంలోకి దూసుకెళ్లింది. ఇంజిన్ నేలను ఢీకొనడంతో మంటలు లేచాయి. ప్రమాదంలో 17 మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలున్నారు.
ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు సంబంధిత అధికారి క్రిస్టి డంక్స్ చెప్పారు. తమకు ఇప్పటి వరకు సమాచారం తగినంత లేదని చెప్పారు. మరణించిన వారి సంఖ్యను కూడా కచ్చితంగా చెప్పలేమని అన్నారు. ప్రమాదానికి గురైన విమానం పైలాటస్ పిసి-12 2001లో తయారైంది. ఇటువంటి విమానంలో 12 మంది మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుంది. పిల్లలు ఈ విమానంలో ఆకాశ యాత్రకు బయలు దేరినట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Monday, March 23, 2009, 11:33 [IST]