హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగుదేశం, తెరాస: సీట్ల చిచ్చు

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. తెరాస అడిగినన్ని సీట్లు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ నిరాకరించడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో మహా కూటమి నుంచి తప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆదివారం సాయంత్రం పార్టీ నాయకుల సమావేశంలో చెప్పారు. అయితే ఇరు పార్టీల నాయకుల మధ్య సోమవారం చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల్లో తెరాస తరఫున హరీష్ రావు, నాయని నర్సింహారెడ్డి, కె.టి.రామారావు, తెలుగుదేశం పార్టీ తరఫున ఎర్రంనాయుడు, ఎర్రబెల్లి దయాకరరావు పాల్గొంటున్నారు.

తెరాస 51 అసెంబ్లీ సీట్లు అడుగుతోంది. అయితే 41-42 సీట్లు మాత్రమే ఇవ్వడానికి మాత్రమే తెలుగుదేశం సుముఖత వ్యక్తం చేస్తోంది. జడ్చర్ల, మెదక్, సూర్యాపేట, నర్పంపేట, నిజామాబాద్ రూరల్, నిర్మల్, రామగుండం, మంచిర్యాల, అచ్చంపేట సీట్ల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X