మీడియాపై జూ.ఎన్టీఆర్ సెక్యూరిటీ దాడి
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ నేత యంగ్స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సెక్యూరిటీ సిబ్బంది మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. దీంతో ముగ్గురు కెమెరామెన్లు గాయపడ్డారు. మీడియా ప్రతినిధులందరు కలిసి ఎన్టీఆర్ వాహనానికి అడ్డు నిలిచి ధర్నాకు దిగారు. రోడ్ షో అక్కడే అగిపోయింది. దాడిని తెలుసుకున్న ఎన్టీఆర్ మీడియాకు క్షమాపణలు చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు శాంతిచడంతో పర్యటన తిరిగి ప్రారంభం అయింది.
Story first published: Tuesday, March 24, 2009, 17:59 [IST]