వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుప్వారా ఎన్కౌంటర్: 25 మంది మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కొనసాగిన భీకర పోరు ఎట్టకేలకు ముగిసింది. ఎదురుకాల్పుల్లో 17మంది తీవ్రవాదులు, 8మంది సైనికులు మృతి చెందినట్లు ఆర్మీ అధికార ప్రతినిధి జేఎస్ బ్రార్ తెలిపారు. ఈనెల 20నుంచి ఈ ఎదురుకాల్పులు జరిగాయి. మొత్తం మీద 25మంది మృతిచెందారు. ఇటీవలి కాలంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇంతమంది మరణించటం ఇదే మొదటిసారి.
నిఘా విభాగాల సమాచారం మేరకు తాము ఆపరేషన్ చేపట్టామని బ్రార్ చెప్పారు. సోమవారం నాడు నలుగురు సైనికులు, ఐదుగురు మిలిటెంట్లు మరణించారు. అంతకు ముందు రోజు ఒక మిలిటెంట్ మరణించారు. శనివారంనాడు మేజర్ మోహిత్ సేన్ తో పాటు ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. పాకిస్తాన్, భారత సైనికుల మధ్య కాల్పులతో ఈ ఎన్ కౌంటర్ యుద్ధం మొదలైంది. పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో ఒక భారత సైనికుడు గాయపడ్డాడు.
Comments
Story first published: Wednesday, March 25, 2009, 12:19 [IST]