వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రైలు బండి గుర్తుపై చిరంజీవి హర్షం
రైలు బండి గుర్తుపై చిరంజీవి హర్షం జగ్గంపేట: ప్రజారాజ్యం పార్టీకి ఉమ్మడి గుర్తు రావడం ఆ పార్టీ అధినేత చిరంజీవి హర్షం ప్రకటించారు.శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాఅకింత యాత్రలో పాల్గొన్న చిరంజీవి ఉమ్మడి గుర్తు రావడంపై స్పందించారు. చాలా మంది ఉమ్మడి గుర్తు రాదని అన్నారని, తమకు మాత్రం ఆ విశ్వాసం ఉందని, తమ నమ్మకం వమ్ము కాలేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నామని, ఉగాది రోజు కామన్సింబల్ లభించడం సంతోషదాయకం అని ఆయన అన్నారు. తమకు ప్రజాబలం వల్లే ఉమ్మడి గుర్తు వచ్చిందని చిరు చెప్పారు.
Story first published: Friday, March 27, 2009, 14:43 [IST]