చిరు మాకు పోటీయే కారు: బాలయ్య
వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన జలయజ్ఞం ధన యజ్ఞంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందని సినీహీరో బాలకృష్ణ అన్నారు. చిత్తూరుజిల్లాలో రెండురోజుల పాటు ఆయన పర్యటిస్తున్నారు. అవినీతి కాంగ్రెస్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కాంగ్రెసు పాలనలో దాపురించిందని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, March 31, 2009, 15:12 [IST]