అమెరికాలో భారతీయ కుటుంబం హతం
చెన్నై: అమెరికాలోని భారత ఐటి వృత్తి నిపుణుడు తన ఐదుగురు కుటుంబ సభ్యులను కాల్చి చంపి తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దేవరాజన్ అనే ఎన్నారై కుటుంబంలోని ఐదుగురిని కాల్చి చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు చెన్నైలోని ఆయన బంధువులకు సమాచారం అందింది. ఈ సంఘటన సోమవారం రాత్రి అమెరికాలోని సిలికాన్ వ్యాలీలోని శాంతా క్లారాలో జరిగినట్లు సమాచారం.
తన అల్లుడు దేవరాజన్ తన కుమారుడు అశోకన్ తో గొడవ పడి తన కూమారుడిని, తన కోడలిని, వారి కూతురు నేహా, తన కూతుర అభా, వారి పిల్లలు అఖిల్, ఆహానాలను కాల్పులు జరిపాడని, తమిళనాడులోని అయ్యంకోల్లాయ్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల రిటైర్డ్ ఉపాధ్యాయుడు అప్పు మాస్టర్ గోడుగోడునా విలపిస్తూ చెప్పాడు. దేవరాజన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన చెప్పారు. ఒక్క అభా మాత్రమే బతికి ఉన్నాడని ఆయన చెప్పారు. తమ కుటుంబం 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిందని, ఇప్పటి వరకు బాగానే కలిసి మెలిసి ఉన్నారని ఆయన చెప్పారు. దేవరాజన్, అశోకన్ ఇద్దరు మలయాళీ మాట్లాడే ఐటి వృత్తి నిపుణులు. అయితే వారిది చెన్నై సమీపంలోని అయ్యంకోలాయ్ గ్రామం.