ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ రెబెల్స్ కు వైయస్ లేఖలు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: ఎన్నికల్లో టిక్కెట్లు ఆశించి భంగపడిన కాంగ్రెస్‌ నేతలకు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి వ్యక్తిగత లేఖలు రాశారు. టిక్కెట్లు రానివారు అసమర్థులు కారని, ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పలు కోణాల్లో ఆలోచించి ఇతరులను అధిష్టానం ఎంపిక చేసిందని ఆయన ఆ లేఖలో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ పరిస్థితి బాగుందని, ఏ చిన్న పొరపాటు జరిగినా పార్టీకి నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతా కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషిచేయాలని కోరారు. ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తేల్చుకోలేక మహాకూటమి సతమతం అవుతోందని, అటువంటి పార్టీలు ఎలా గెలుస్తాయని, కాంగ్రెస్‌ విజయం తథ్యమని పేర్కొన్నారు. టిక్కెట్లు దక్కనివారికి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

ఆయన మంగళవారంనాడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం చేశారు. ఈ ప్రచార సభల్లో ఆయన ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అన్నింటినీ రద్దు చేస్తాయని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తెల్ల రేషన్ కార్డుల కోసం ప్రజలు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరిగారని, తాము అడిగినవారికి అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చామని ఆయన అన్నారు. తాము గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అన్నింటినీ ఈ ఐదేళ్ల కాలంలో అమలు చేశామని ఆయన చెప్పుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X