శ్రీవారి సేవలో చిరంజీవి సతీమణి
తిరుపతి: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సతీమణి సురేఖ బుధవారంనాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేణిగుంట విమానాశ్రయంలో ఆమెకు పార్టీ ముఖ్యులు, కుటుంబస్నేహితులు స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆమె కాణిపాకం వెళ్లి వినాయకుడిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు.
ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి నామినేషన్ వేయనుండటం, సురేఖ కూడా చిరంజీవి కోసం ప్రచారం చేయనుండటంతో స్వామివారి ఆశీస్సులకోసం సురేఖ ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ నెల 3వ తేదీన పాలకొల్లులో, 4వ తేదీన తిరుపతిలో నామినేషన్లు వేయనున్నారు. పాలకొల్లులో ప్రచారం చేయడానికి సురేఖ సిద్ధపడ్డారు.
Comments
Story first published: Wednesday, April 1, 2009, 16:00 [IST]