వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కసబ్‌ కేసు వాదిస్తా: అంజలి

By Staff
|
Google Oneindia TeluguNews

Anjali Waghmare
ముంబయి: ముంబయి దాడుల కేసులో ప్రధాన నిందితుడు అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ కేసును వాదించేందుకు న్యాయవాది అంజలి వాగ్మారే అంగీకరించారు. ఈ కేసులో వాదించవద్దని వచ్చిన తీవ్రమైన ఒత్తిళ్లను, శివసేన బెదిరింపులను తట్టుకోలేని ఆమె ఈ కేసును వాదించబోనని ప్రకటించారు. అయితే ఆమెకు జడ్‌ కేటగిరీ రక్షణ కల్పిస్తామని హామీ లభించటంతో ఈ కేసును వాదించేందుకు అంగీకరించారు. ఈ మేరకు జస్టిస్‌ తహిల్యానీకి ఆమె తన అంగీకారం తెలిపారు.

ఈ కేసును ప్రజల దృష్టికి తెస్తున్నందుకు ఆమె మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను ఈ కేసును వాదించాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. తన ఇంటిపై దాడికి తాను దిగ్భ్రాంతి చెందానని, ఈ దాడి తర్వాత తనకు తగిన భద్రత కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తనకు జెడ్ కెటగిరీ భద్రత కల్పించారని ఆమె చెప్పారు. ముంబయి దాడుల కేసుపై ఈ నెల 6వ తేదీన విచారణ ప్రారంభం కానుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X