ఘనతలన్నీ మావే: చంద్రబాబు
కలర్ టీవీలు ఇస్తామని తాము ఇచ్చిన హామీకి కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీ నాయకులు గింజుకుంటున్నారని, ఏం చేయాలో వారికి తోచడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కార్యక్రమాలన్నీ మేడిపండులాంటవని ఆయన అన్నారు. పేదల కోసం నగదు బదిలీ పథకం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సమగ్రంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. కాంగ్రెసు ఉపాధి హామీ పథకం అవినీతిమయంగా మారిందని ఆయన అన్నారు.
తెలంగాణపై తాము స్పష్టంగా ఉన్నామని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసమైన చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఆయన చెప్పారు. రైతుల రుణాలను అన్నింటినీ మాఫీ చేయిస్తామని ఆయన చెప్పారు. సన్నకారు, చిన్నకారు రైతులకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తామని ఆయన చెప్పారు. రైతులకు 12 గంటల పాటు పగటి పూట కరెంట్ ఇస్తామని ఆయన చెప్పారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టే పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు.