వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అద్వానీ నామినేషన్: మోడీకి ప్రశంసలు
భారతదేశానికి చెందిన లక్షల, కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్నాయని, దాన్ని దేశానికి తెప్పించి వాడితే మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దవచ్చునని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే దేశాన్ని 21వ శతాబ్దిలోకి నడిపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాము అధికారంలో ఉన్న గుజరాత్, ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో మంచి పాలనను అందిస్తున్నామని ఆయన చెప్పుకున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఆయన ప్రశంసలతో ముంచెత్తారు. తాను అగ్రస్థానంలో ఉన్నానంటే అది నరేంద్ర భాయ్ వంటివారి కృషేనని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, April 8, 2009, 18:09 [IST]