నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిక్కుల్లో డిఎస్: వ్యాఖ్యల తంటా

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్‌: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కష్టాల్లో పడ్డారు. నిజామాబాద్‌ పట్టణంలో నిర్వహించిన మైనార్టీ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఐవీ సుబ్బారావు మంగళవారం ఎన్నికల కమిషన్ (ఈసీ) కి నివేదిక పంపించారు. ప్రత్యేక దూత ద్వారా సీడీలనూ పంపించారు.'నేను మీ కోసం తల నరుక్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా వేలెత్తితే ఆ చెయ్యినే తీసేస్తాను' అని వ్యాఖ్యానించినట్లుగా సీడీలో స్పష్టంగా ఉన్నట్లు ఎన్నికల అధికారుల పరిశీలనలో తేలింది. మైనార్టీ సభలో ఇలా వ్యాఖ్యలు చేయడం వివిధ వర్గాలను రెచ్చగొట్టడమేనని, ఇది కచ్చితంగా సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

విషయ తీవ్రత దృష్ట్యా సీడీలను ఈసీ బుధవారమే పరిశీలించే అవకాశం ఉంది. సుబ్బారావు నుంచి వెళ్లిన నివేదిక ప్రకారం చూస్తే డీఎస్‌కు తప్పనిసరిగా నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఈసీ భావిస్తే వరుణ్‌ గాంధీలాగే ఎన్నికల బరి నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ పార్టీకి సూచించినా ఆశ్చర్యపోనవసరం లేదని కొందరు అధికారులు చెబుతున్నారు. డీఎస్‌ వ్యాఖ్యలపై సీడీని చూసి తన నివేదికను ఈసీకి పంపించానని సుబ్బారావు మీడియా ప్రతినిధులతో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X