వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రేపల్లి లోక్ సత్తా అభ్యర్థి మృతి
గుంటూరు: గుంటూరు జిల్లా రేపల్లె లోక్ సభ స్థానానికి ఎన్నిక యధావిధిగా జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జయేష్ రంజన్ తెలిపారు. అక్కడ లోక్ సభ స్థానానికి పోటీలో ఉన్న లోక్ సత్తా అభ్యర్థి తుమ్మల సత్యనారాయణ చౌదరి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో అక్కడ ఎన్నిక వాయిదా పడుతుందని ప్రచారం జరిగింది. దీనిపై కలెక్టర్ వివరణ ఇస్తూ రిజిష్టర్ అయిన పార్టీల విషయంలో ఆ నిబంధన వర్తించదని లోక్సత్తా రిజిష్టర్ అయిన పార్టీ కనుక ఎన్నిక యధావిధిగా జరుగుతుందని ప్రకటించారు.
గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి చనిపోతే మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కూడా అదే విషయం చెప్పారు. తుమ్మల సత్యనారాయణ చౌదరి మృతితో పార్టీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాలి.
Comments
Story first published: Wednesday, April 8, 2009, 16:25 [IST]