వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా వంశానికే చెల్లింది: బాలయ్య

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
విజయనగరం: మీసాలు మెలేయడం, తొడ కొట్టడం తమ వంశానికే చెల్లిందని సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ అన్నారు. విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గురువారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మీసాలు మెలేయడం, తొడ కొట్టడం పౌరుషానికి సంకేతమని ఆయన అన్నారు. ప్రచార సభల్లో తాను మీసాలు మెలేయడం, తొడ కొట్టడంపై వస్తున్న విమర్శలకు ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు.

కాంగ్రెసు అవినీతి డబ్బుతో రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టవచ్చునని ఆయన అన్నారు. కాంగ్రెసు అవినీతి లెక్క లేని స్థాయిలో పేరుకుపోయిందని ఆయన అన్నారు. ఆ డబ్బుతో నగదు బదిలీ పథకాన్ని అమలు చేయవచ్చునని, ప్రాజెక్టులు కూడా నిర్మించవచ్చునని ఆయన అన్నారు. బొబ్బిలి నుంచి ఆయన తన రోడ్ షోను ప్రారంభించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X