ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పై రెండు కేసులు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
ఒంగోలు: కాంగ్రెసు నాయకుడు, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఒంగోలు రూరల్ పోలీసులు రెండు కేసులు పెట్టారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఒంగోలులో రోడ్ షో నిర్వహించినందుకు ఆయనపై ఈ కేసులు నమోదు చేశారు. ఆయన బుధవారంనాడు ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, చీమకుర్తి తదితర ప్రాంతాల్లో పర్యటించి రాత్రి ఒంగోలుకు చేరుకున్నారు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత ఆయన ఒంగోలులో రోడ్ షో నిర్వహించారు. దీంతో పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు.

కాంగ్రెసు చేసిన అభివృద్ధి జగన్ తన పర్యటనలో ప్రజలకు వివరించారు. రాష్ట్రం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో ఎంతో అభివృద్ధి సాధించిందని చెబుతూ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెసును గెలిపించాలని కోరారు. ప్రజలకు మేలు చేసే పార్టీ కేవలం కాంగ్రెసు మాత్రమేనని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X