వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగిత్యాల సభకు బాలయ్య డుమ్మా

By Staff
|
Google Oneindia TeluguNews

Balakrishna
కరీంనగర్‌: సినీనటుడు బాలకృష్ణ కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల సభ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. మంగళవారం ప్రచారానికి చివరిరోజు కావటంతో తెలుగుదేశం తరపున కరీంనగర్ జిల్లా జగిత్యాలలో బాలకృష్ణ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఆయన వస్తారని తెలిసి జనం కూడా బాగా హాజరయ్యారు.

సభలో పాల్గొనేందుకు బాలకృష్ణ రాగా అక్కడ ఆయనకు పోలీసులు భద్రత కల్పించలేదని తెలిసింది. దీంతో ఆయన సభకు హాజరుకాకుండానే సిరిసిల్ల వెళ్లిపోయారు. దీంతో ప్రజలు, స్థానిక నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మంత్రి జీవన్‌రెడ్డి ఒత్తిడికి లొంగి పోలీసులు భద్రత కల్పించలేదని, తమ సభ విఫలం కావాలనే ఇలా చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X