వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్లీ లీడర్ లాగా వైయస్: ఎమ్మెస్

By Staff
|
Google Oneindia TeluguNews

M Satyanarayana Rao
కరీంనగర్: తెలంగాణపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేత ఎం. సత్యనారాయణ తప్పు పట్టారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడటం సరి కాదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు కాంగ్రెసు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రకటన వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడటం మంచిది కాదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి నేత అలా మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై వేసిన ఆర్థిక మంత్రి రోశయ్య కమిటీ కూడా బోగస్ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విషయంలో మాట నిలబెట్టుకోకపోతే కాంగ్రెసు పార్టీకి తిప్పలు తప్పవని ఆయన అన్నారు. తెలంగాణపై రాజశేఖర రెడ్డి మాటల కన్నా సోనియా గాంధీ మాటలనే తాను నమ్ముతానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X