హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ పై కేసు పెడ్తాం: హరీష్

By Staff
|
Google Oneindia TeluguNews

Harish Rao
హైదరాబాద్: ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై కేసు పెడతామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత హరీష్ రావు చెప్పారు. తమ న్యాయవాదులతో సంప్రదించిన తర్వాత వైయస్ పై కేసు పెడతామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయలసీమలో వైయస్ మాట్లాడిన తీరుపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తాము కోస్తా, రాయలసీమ ప్రజలకు వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు. వైయస్ మాటలను ఆ ప్రాంతాల ప్రజలు కూడా నమ్మబోరని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మాటలపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాజశేఖర రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని తాము ఇసికి ఫిర్యాదు చేసినట్లు బిజెపి నాయకుడు రామచంద్రారావు చెప్పారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X