ఎయిర్పోర్టు సిబ్బంది ఆందోళన
హైదరాబాద్: జీతాలు సరిగా ఇవ్వడం లేదంటూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం అర్థరాత్రి ఆందోళనకు దిగారు. తమతో వెట్టి చాకిరి చేయించుకొని వేతనాలు సరైన సమయానికి ఇవ్వడం లేద, 12 గంటలు పని చేయించుకొని 8 గంటలకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఆందోళనలో మొత్తం కింగ్ ఫిషర్ తదితర విమానాలకు సంబంధించిన 400 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. వీరి ఆందోళన కారణంగా కింగ్ ఫిషర్ తదితర విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Comments
Story first published: Wednesday, April 22, 2009, 11:29 [IST]