వైయస్ కు అగ్ని పరీక్షే
రెండో విడత పోలింగ్ జరుగుతున్న రాయలసీమ, దక్షిణ కోస్తా నియోజకవర్గాల్లో పాగా వేయడానికి కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ముఖ్యమంత్రి భవితవ్యం ఈ నియోజకవర్గాల మీదనే ప్రధానంగా ఆధారపడింది. దక్షిణ కోస్తాలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కాంగ్రెసుకు అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. రెండో విడత సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకుంటేనే వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడానికి వీలుంటుందని భావిస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 154 స్థానాల్లో ఎక్కువ స్థానాలు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎంలతో కూడిన మహా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
Comments
Story first published: Thursday, April 23, 2009, 9:20 [IST]