హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ కు అగ్ని పరీక్షే

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి భవిష్యత్తు గురువారంనాటి పోలింగ్ తో తేలనుంది. తిరిగి అధికారం చేపట్టడానికి ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. అయితే అది అంత సులభం కాదని అంటున్నారు. అయితే రాష్ట్రంలోని 140 శాససనభ స్థానాలకు గురువారం పోలింగ్ ముగుస్తుంది. దీంతో రాష్ట్రంలోని 294 స్థానాలకు పోలింగ్ ముగుస్తుంది. తెలంగాణ, ఉత్తరాంధ్రలోని 154 శాసనసభా స్థానాలకు తొలి విడత ఈ నెల 16వ తేదీన పోలింగ్ ముగిసింది. తొలి విడత పోలింగ్ జరిగిన స్థానాల్లో కాంగ్రెసుకు ఎదురు దెబ్బ తగులుతుందని అంచనాలు వేస్తున్నారు. దీంతో రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో వైయస్ తన దృష్టిని కేంద్రీకరించారు.

రెండో విడత పోలింగ్ జరుగుతున్న రాయలసీమ, దక్షిణ కోస్తా నియోజకవర్గాల్లో పాగా వేయడానికి కాంగ్రెసు తీవ్ర ప్రయత్నాలు చేసింది. ముఖ్యమంత్రి భవితవ్యం ఈ నియోజకవర్గాల మీదనే ప్రధానంగా ఆధారపడింది. దక్షిణ కోస్తాలో తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీల మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో కాంగ్రెసుకు అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. రెండో విడత సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలను గెలుచుకుంటేనే వైయస్ రాజశేఖర రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావడానికి వీలుంటుందని భావిస్తున్నారు. తొలి విడత పోలింగ్ జరిగిన 154 స్థానాల్లో ఎక్కువ స్థానాలు తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, సిపిఎంలతో కూడిన మహా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X