వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
'పెద్దపులి' స్థావరం దొరికినట్లే
శ్రీలంక సైన్యం నిర్ణయాత్మక ప్రదేశానికి చేరుకున్న విషయాన్ని రక్షణ శాఖ అధికార ప్రతినిధి లక్ష్మణ్ హుల్లగాలే ధృవీకరించారు. ఎల్టీటిఇపై పోరు దాదాపుగా పూర్తయిందని ఆయన చెప్పారు. తమ బలగాలు ప్రభాకరన్ స్థావరానికి చాలా దగ్గరలో ఉన్నాయని చెప్పారు. ఎల్టీటిఇ కార్యకర్తలు ఇంకా శ్రీలంక సైన్యాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నారు. తిరుగుబాటుదార్లు లొంగిపోవాలని శ్రీలంక అధ్యక్షుడు మహీందా రాజపక్షే సూచించారు. వేలుపిళ్లై ప్రభాకరన్ కు ప్రాణబిక్ష పెట్టబోమని ఆయన చెప్పారు.
Story first published: Thursday, April 23, 2009, 16:02 [IST]