వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రం ద్వారా 'తమిళ పులి' పరారీ?

By Staff
|
Google Oneindia TeluguNews

Prabhakaran
కిలినోచ్చి: సైన్యం దిగ్భంధనలో ఉన్న ఎల్‌టీఇఈ చీఫ్‌ ప్రభాకరన్‌ సముద్ర మార్గాన పారిపోయే అవకాశం ఉందని సైన్యం వెల్లడించింది. నోఫైర్‌ జోన్‌లో ఉన్న ప్రభాకరన్‌, తన కుమారుడు ఆంటొనీ, టైగర్స్‌ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ పొట్టు అమ్మాన్‌, సీటైగర్‌ చీఫ్‌ సూసయిలతో కలిసి సబ్‌మెరైన్‌లో పారిపోయే అవకాశం ఉన్నట్లు సైన్యంలో పనిచేసే ఉన్నతాధికారి బ్రిగేడియర్‌ శావేంద్ర డిసౌల్వ తెలిపారు.

సైన్యానికి లొంగిపోయిన ఎల్టీటిఈ అధికారప్రతినిధి దయామాష్టర్‌ ఈ విషయాన్ని వెల్లడిచేశారని, ఇది తెలియగానే సైన్యం సముద్రమార్గంలో నిఘాను పెంచిందని ఆయన తెలిపారు. తమ సైన్యం ప్రభాకరన్ కు చాలా దగ్గరికి చేరుకుందని, అయితే ఆ ప్రాంతాన్ని సైన్యం స్వాధీనంలోకి తీసుకోవడానికి రెండు రోజుల ముందే ప్రభాకరన్ పారిపోయాడని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X