వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాటకు కట్టుబడి ఉన్నా: వైయస్
న్యూఢిల్లీ : శాసససభ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ పార్టీకి 230 సీట్లు వస్తాయనే మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జరిగిన విధానసభ ఎన్నికల్లో తాము తిరిగి అధికారం కైవశం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విధానసభలో 230 స్థానాలు సాధిస్తామని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.
ఆయన ఆదివారం ఉదయం దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు.. రాష్ట్రంలో జరిగిన పోలింగ్ సరళిని ఆయన అధిష్ఠానానికి వివరించనున్నారు. అనంతరం ఢిల్లీలో తెలుగువారు నివసించే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తారు. తరువాత వేసవివిడిది కోసం సిమ్లాకు వెళ్లనున్నారు.
Story first published: Wednesday, April 29, 2009, 11:07 [IST]