చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి నిరశన దీక్ష విరమణ

By Staff
|
Google Oneindia TeluguNews

Karunanidhi
చెన్నై: తమిళ టైగర్లపై శ్రీలంక ప్రభుత్వం కాల్పులు విరమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి ఉపసంహరించుకున్నారు. శ్రీలంక సైన్యం కాల్పులు విరమించుకోవడానికి అంగీకరించడంతో ఆయన తన దీక్షను విరమించుకున్నట్లు సమాచారం. కరుణానిధి దీక్షకు మద్దతుగా ఆయన కుమారుడు ఆళగిరి కూడా నిరాహార దీక్షకు దిగారు. తమిళనాడులో కరుణానిధికి మద్దతుగా డిఎంకె కార్యకర్తలు బస్సులపై దాడులు చేశారు.

దీక్ష విరమింపజేయడానికి అంతకు ముందు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రయత్నించారు. కరుణానిధితో మన్మోహన్ సింగ్ ఫోన్ లో మాట్లాడారు. అయితే కరుణానిధి దీక్ష విరమణకు నిరాకరించారు. తమిళుల రక్షణకు ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని కరుణానిధి ప్రకటించారు. ఆయన వెన్నుపూసకు జరిగిన శస్త్ర చికిత్స తర్వాత క్రమంగా కోలుకుంటున్నారు. 85 ఏళ్ల కరుణానిధి సోమవారం ఉదయం పూట మందులు కూడా తీసుకోకుండానే నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఆయన ప్రాణాలకు ఉన్న ముప్పును గమనించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రతిస్పందించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ కరుణానిధి ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారని, టెలిఫోనులో కరుణానిధితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు వీరప్పమొయిలీ ఢిల్లీలో చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X