మిత్రాకు చిరంజీవి బుజ్జగింపులు
పార్టీకి రాజీనామా చేయవద్దని ప్రజారాజ్యం రాజకీయ వ్యవహారాల కమిటీ మిత్రాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఆంజనేయరెడ్డి, పరకాల ప్రభాకర్ వంటి నాయకులు ప్రజారాజ్యం పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో మిత్రా కూడా అదే దారి పడుతారని ఊహాగానాలు చెలరేగుతూ వచ్చాయి. ఈ స్థితిలో చిరంజీవి మిత్రాపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మీరు పార్టీలోనే ఉన్నారా అని చిరంజీవి మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించడం మిత్రాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్టీని వీడిపోవడం ధర్మం కాదనే ఉద్దేశంతో ఆయన ఇంత కాలం ఆగినట్లు చెబుతున్నారు.
Comments
Story first published: Monday, April 27, 2009, 16:05 [IST]