వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఖత్రోచీపై రెడ్ కార్నర్ నోటీసు రద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

Ottavio Quattrocchi
న్యూఢిల్లీ: బోఫోర్స్ కేసు నిందితుడు ఒట్టావో ఖత్రోచీ పేరును కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) మోస్ట్ వాంటెడ్ జాబితా నుంచి తొలగించింది. ఈ మేరకు మీడియా విస్తృతంగా వార్తలు వచ్చాయి. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఇటలీ వ్యాపారవేత్త ఖత్రోచీ పేరును సిబిఐ మోస్ట్ వాంటెడ్ జాబితా నుంచి తొలగించడంతో ఆయనపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసును ఉపసంహరించుకోవడానికి వీలు కలుగుతోంది. ఆయనపై గత 12 ఏళ్లుగా రెడ్ కార్నర్ నోటీసు ఉంది.

ఖత్రోచీపై రెడ్ కార్నర్ నోటీసును కొనసాగించడంలో అర్థం లేదని, ఆ నోటీసును ఉపసంహరించుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాల్సి ఉందని అటార్నీ జనరల్ మిలన్ బెనర్జీ అభిప్రాయపడ్డారు. నోటీసు ఉపసంహరించుకోవడానికి కారణమేమిటనే విషయంపై మాట్లాడడానికి సిబిఐ డైరెక్టర్ అశ్వినీ కుమార్ నిరాకరించారు. భారతదేశంలో వెలుగు చూసిన కుంభకోణాల్లో బోఫోర్స్ చాలా పెద్దది. ఈ కుంభకోణం 1980 దశకంలో వెలుగు చూసింది. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీతో పాటు పలువురు బోఫోర్స్ వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X