ప్రమాదంలో ముగ్గురు రైతుల మృతి
హైదరాబాద్: నగర శివారులోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అవేర్ గేట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఈ ఉదయం కూరగాయలతో వస్తున్న డీసీఎం వ్యాన్, లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటన స్థలంలోనే ముగ్గురు రైతులు మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
Comments
Story first published: Thursday, April 30, 2009, 10:19 [IST]