రైలు ప్రమాదంపై సిబిసిఐడి దర్యాప్తు
చెన్నై: చెన్నైలో బుధవారం జరిగిన రైలు ప్రమాదంపై తమిళనాడు సిబిసిఐడి దర్యాప్తు చేపట్టింది. ఈ ప్రమాదం వెనక కుట్ర ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిబిసిఐడి తన దర్యాప్తును మొదలు పెట్టింది. ఇది అల్లరి చర్య అయినా గానీ కుట్ర గానీ అయి వుండవచ్చునని, ఏమిటనేది ఇప్పుడే చెప్పడం కష్టమని, తాము అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని సిబిసిఐడి ఎడిజిపి అర్చనా రామసుందరం గురువారం చెప్పారు.
బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా 11 మంది గాయపడ్డారు.సిబిసిఐడి దర్యాప్తునకు అప్పగించిన తర్వాత ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీనియర్ అధికారులు చెప్పారు. తీవ్రవాదుల పాత్ర ఉందా అనే కోణం నుంచి కూడా దర్యాప్తు సాగుతోంది.
Comments
Story first published: Thursday, April 30, 2009, 12:32 [IST]