హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవార్ ను అహ్వానిస్తాం: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ఎన్సీపి నేత శరద్‌ పవార్‌ ప్రధాన మంత్రి పదవికి అర్హుడని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. శరద్ పవార్ ను నాలుగో కూటమిలోకి ఆహ్వానిస్తామని ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో చెప్పారు. గత రెండు రోజులుగా ఇదే విషయమై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్రంలో నాలుగో కూటమి గురించి తానేమీ యథాలాపంగా చెప్పడం లేదని, దానికి సంబంధించి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయని, సమాజ్‌వాది పార్టీ నేత అమర్‌ సింగ్‌ ఆ పనిలో ఉన్నారని ఆయన మంగళవారంనాడు చెప్పారు.

నాలుగో కూటమి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, అమర్‌ సింగ్‌ ఆ విషయాలు చూస్తున్నారని ఆయన మరోసారి చెప్పారు. ప్రధాని పదవి రేసులో ఉన్న శరద్‌ పవార్‌ను మీరు సమర్థిస్తారా? అని అడిగితే పవార్‌ మంచి నాయకుడని, ఆయన ప్రధాని రేసులో ఉన్నారని, ప్రధాని పదవికి ఆయన అర్హుడు కూడా అని, అంతా బాగా జరిగి నాలుగో కూటమి ఏర్పడితే పీఎం అభ్యర్థిగా ఆయన పేరును పరిశీలిస్తామని చిరంజీవి బదులిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X