హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గెలుపుపై తెరాసలో ధీమా

By Staff
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శిబిరంలో ఆనందోత్సహాలు వెల్లి విరుస్తున్నాయి. తమకు 27 శాసనసభా స్థానాలు, 6 లోకసభ స్థానాలు వస్తాయని పార్టీ నిర్వహించిన సర్వేలో తేలినట్లు తెరాస నాయకుడొకరు చెప్పినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. తెరాస తెలుగుదేశం, వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుని 45 శాసనసభా స్థానాలకు, 8 లోకసభ స్థానాలకు పోటీ చేసింది.

ఉత్తర తెలంగాణలో తమ సత్తా చాటుకుంటామని, కరీంనగర్ జిల్లాలో పోటీ చేసిన 10 స్థానాల్లో 8 గెలుచుకుంటామని, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 14 సీట్లకు పోటీ చేయగా 14 సీట్లు గెలుచుకుంటామని తెరాస నాయకులు అంటున్నారు. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో 11 సీట్లకు పోటీ చేయగా నాలుగు మాత్రమే గెలుచుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. హైదరాబాదులోని ఆరు అసెంబ్లీ స్థానాలకు తెరాస పోటీ చేసింది. వీటిలో గెలుపు దాదాపు అసాధ్యమే.

లోకసభ స్థానాల్లో ఆరింటిలో తాము విజయం సాధించే అవకాశాలున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ నుంచి పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, మెదక్ నుంచి పార్టీ సెక్రటరీ జనరల్ విజయశాంతి పోటీ చేశారు. లక్షకు పైగా మెజారిటీలతో వీరు గెలుస్తారని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X