పోలీసుల చేతిలో టెర్రరిస్టు నిస్సార్
హైదరాబాద్: పేరు మోసిన తీవ్రవాది నిస్సార్ పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అతన్ని అజ్ఞాత ప్రదేశంలో అతన్ని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 2001లో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన బాంబు పేలుడులో ఇతను ప్రధాన నిందితుడు. గత ఏడేళ్లుగా అతను పరారీలో ఉన్నాడు. అతను మాజీ ఎఆర్ కానిస్టేబుల్ కుమారుడు. రాష్ట్రంలోని జహీరాబాద్ ప్రాంతంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లో తల దాచుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి నిస్సార్ ను అరెస్టు చేశారు.
నిస్సార్ లష్కరే తోయిబా కార్యకర్త. 2002 నుంచి నిస్సార్ ఆచూకీ తెలియడం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చెచెన్యా, ఇరాక్ దేశాల్లో నిస్సార్ పని చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాదు నుంచి పారిపోయిన నిస్సార్ బంగ్లాదేశ్ లో తలదాచుకుని ఇటీవలే భారత్ కు చేరుకున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల హైదరాబాదులోని సంతోష్ నగర్ లో పోలీసులపై కాల్పులు జరిపిన వికార్ నిసార్ అనుచరుడని తెలుస్తోంది.