హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేటగాళ్లు జగన్ సంస్థ ఉద్యోగులు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
మహబూబ్ నగర్: నల్లమల అడవుల్లో జంతువులను వేటాడుతూ పట్టుబడినవారు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీకి చెందినవారని వార్తలు రావడం సంచలనం సృష్టిస్తోంది. నల్లమల అడవుల్లో మహబూబ్ నగర్ జిల్లా బల్మూరు వద్ద వేట కొనసాగిస్తూ శుక్రవారం ఆరుగురు అరెస్టయిన విషయం తెలిసిందే. అరెస్టయిన వారు జగన్ కు చెందిన జననీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉద్యోగులని వార్తలు వచ్చాయి. దాని ప్రధాన కార్యాలయం బెంగుళూర్ లో ఉంది. అరెస్టయిన వారు మాత్రం హైదరాబాదులోని బంజారా హిల్స్ రోడ్ నెం.3లో గల ఆ సంస్థ శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు.

అరెస్టయినవారిలో టీపీ అశోక్‌ కుమార్‌ జననీ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ లో సూపర్‌ వైజర్‌ గా, కె.రవీంద్రనాథ్‌ సివిల్‌ ఇంజనీర్‌గా, గొల్ల రవికుమార్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌గా, గులాం ఫయాజ్‌ డ్రైవర్‌గా అదే కంపెనీలో పని చేస్తున్నారు. వీరితోపాటు బాలాజీ కన్‌స్ట్రక్షన్స్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న వాక శ్రీనివాస్‌, జేబీ ఐటీలో బీటెక్‌ చేస్తున్న గుమ్మడపు రాహుల్‌ కూడా అటవీ సిబ్బందికి దొరికారు. ఈ వేటకు ప్రధాన సూత్రధారి జననీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌లో కాంట్రాక్టర్‌ గా పనిచేస్తున్న కృష్ణారెడ్డి అని తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X