హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసీఅర్ ఢిల్లీ టూర్ మళ్ళీ వాయిదా

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖరరావు మరోసారి ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. తిరిగి ఈ నెల ఆరో తేదీన ఢిల్లీ వెళ్లే అవకాశు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కెసీఅర్ తెలంగాణ అంశంపై జాతీయ నాయకులతో చర్చించేందుకు సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. ఉత్తర భారతంలో ఇంకా ఎన్నికలు ముగియకపోవడంతో నాయకులందరు ప్రచారంలో బిజీగా ఉన్నారు. అందుకే పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తొంది

ఆరో తేదీన ఆయనతో పాటు పార్టీకి చెందిన శాసనసభ అభ్యర్థులు, లోక్‌ సభ అభ్యర్థులు కూడా వెళ్లనున్నారు. కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డీఎ అధికారంలో వచ్చే అవకాశాలున్నాయని చంద్రశేఖరరావు ఒక ఇష్టాగోష్టి సమావేశంలో అనడం గమనార్హం. ఆయన బిజెపి అగ్ర నాయకులతో ఢిల్లీలో మంతనాలు జరుపబోతున్నారు. తెలంగాణ సాధన కోసం అవసరమైతే ఎన్డీఏకు టీఅర్ ఎస్ మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు.

జాతీయ రాజకీయాల్లో మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ ఈసారి కీలక పాత్ర పోషించబోతున్నారని కెసీఅర్ అంచనా వేశారు. ప్రజారాజ్యం పార్టీకి ఎనిమిది నుంచి తొమ్మిది లోక్ సభ స్ధానాలు వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. చిరంజీవి సరైన సమయంలో రాజకీయాల్లోకి రాలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X