చంపేస్తామంటూ..జయలలితకు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తరహాలోనే మే 1, 4 తేదీల మధ్య ఆమెను కడతేర్చుతామని హెచ్చరించారు. దీనిపై అన్నాడిఎంకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈనెల 13న జరుగనున్న లోక్సభ ఎన్నికలకు జయలలిత ప్రచారాన్ని అడ్డుకునేందుకే ఈ హెచ్చరిక లేఖను పంపారని అన్నాడీఎంకే న్యాయవాది ఎన్ నవనీతకృష్ణన్ విమర్శించారు. జయలలితకు తగిన భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిపై జయ ఇంటి సహాయకుడు కార్తికేయన్ తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Story first published: Tuesday, May 5, 2009, 14:14 [IST]