హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలుషిత నీటిపై సిఎం ఆగ్రహం

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్‌: భోలక్‌ పూర్‌ లో కలుషిత నీటి ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఈ ఘటనపై సిమ్లా నుంచి అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బాధితులకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని, ఈ ఘటనపై నివేదిక పంపించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలను ఆపద్బంధు పథకం ద్వారా ఆదుకుంటామని ఆర్థిక మంత్రి రోశయ్య హామీ ఇచ్చారు. కలుషితమైన నీటి సరఫరాను తక్షణం నిలుపుచేసి, ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయమని గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ఎస్పీ సింగ్ ను ఆదేశించినట్టు మంత్రి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X