వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: భోలక్‌పూర్‌ కలుషిత నీరు ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ఆరోగ్య మంత్రి గల్లా అరుణకుమారి ప్రకటించారు. భోలక్‌పూర్‌లో బాధితులను ఆదుకునేందుకు 24 గంటలు పనిచేసే హెల్త్‌ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు మీడియాకు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న తోళ్ల కార్ఖానాలను త్వరలో తరలిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆస్పత్రుల్లో 360 మంది భోలక్‌పూర్‌ వాసులు చికిత్స పొందుతున్నారు.

నేడు ఈ ప్రాంతంలో పర్యటించిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటర్ వర్క్స్ ఎండీని అరెస్టు చేయాలని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X