వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు
హైదరాబాద్: భోలక్పూర్ కలుషిత నీరు ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియాను రాష్ట్ర ఆరోగ్య మంత్రి గల్లా అరుణకుమారి ప్రకటించారు. భోలక్పూర్లో బాధితులను ఆదుకునేందుకు 24 గంటలు పనిచేసే హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు మీడియాకు తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న తోళ్ల కార్ఖానాలను త్వరలో తరలిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆస్పత్రుల్లో 360 మంది భోలక్పూర్ వాసులు చికిత్స పొందుతున్నారు.
నేడు ఈ ప్రాంతంలో పర్యటించిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ మృతుల కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాటర్ వర్క్స్ ఎండీని అరెస్టు చేయాలని ఆయన అన్నారు.
Comments
Story first published: Wednesday, May 6, 2009, 15:50 [IST]