వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లొంగిపోయిన జెసి ప్రభాకర్ రెడ్డి
అనంతపురం: కాంగ్రెస్ నాయకుడు, రాష్ట్ర మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. పదిహేను రోజుల క్రితం తాడిపత్రిలో జరిగిన దాడి కేసులో ఆయన మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది.
పదిహేను రోజుల క్రితం తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పేరం నాగిరెడ్డి, ఇతర తెలుగుదేశం నాయకుల ఇళ్లపై దాడులు జరిగాయి. దీంతో పరస్పరం కాంగ్రెసు, తెలుగుదేశం కార్యకర్తలు దాడులు చేసుకున్నారు. దీంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సంఘటనలో జెసి ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అప్పటి నుంచి ప్రభాకర్ రెడ్డి పోలీసులకు చిక్కలేదు. చివరకు శుక్రవారం మెజిస్ట్రేట్ ముందు లొంగిపోయారు.
Comments
congress కాంగ్రెస్ tadipatri తాడిపత్రి ananthapur అనంతపురం jc prabhakar reddy magistrate జెసి ప్రభాకర్ రెడ్డి
Story first published: Friday, May 8, 2009, 12:34 [IST]