ఆటో-ట్రాక్టర్ ఢీ: ఇద్దరు మృతి
ఖమ్మం: పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. గురువారం మధ్యాహ్నం జంగారెడ్డి గూడెం మండలం జీలుగుమిల్లి దగ్గర ఈ సంఘటన జరిగింది. నలుగురు వ్యక్తులతో వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఘటన స్థలంలోనే ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఖమ్మం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Comments
Story first published: Thursday, May 14, 2009, 16:38 [IST]